Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహామేత.. యువనేత.. యువమేత ఆత్రం... నారా లోకేశ్

మహామేత.. యువనేత.. యువమేత ఆత్రం... నారా లోకేశ్
, శనివారం, 22 ఫిబ్రవరి 2020 (12:33 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంద (సిట్)ను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పదించారు. మహామేత.. యువనేత.. యువమేత ఆత్రం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 'మహామేత', 'యువనేత' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి మహామేత అన్న లోకేశ్.. చంద్రబాబుపై ఆ నాటి వైఎస్ ప్రభుత్వం 26కు పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, నలుగురు అధికారులతో విచారణలు, ఒక సీబీసీఐడీ విచారణ చేయించిందని.. కానీ ఏమైందని ఎద్దేవా చేశారు. 
 
ఇపుడు జగన్ సర్కార్ వచ్చాక.. గత 9 నెలలుగా, మంత్రుల స‌బ్ క‌మిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్ విచారణ, సీఐడీ విచారణ, ఐటీకి, ఈడీకి ఉత్తరాలు రాసి విచారణ చెయ్యమన్నారని.. ఏమైందని ట్వీట్ చేశారు. 
 
ఇప్పుడు కొత్తగా సిట్ అంటున్నారని.. అది కూడా హత్య కేసులను విచారణ చెయ్యాల్సిన పోలీసులతో సిట్ వేశారని విమర్శించారు. యువమేత ఆత్రం.. ఇక్కడే అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. సాధించింది, సాధించేది ఏమి లేనప్పుడు సిట్‌లతో కాలక్షేపం చెయ్యడమే పనిగా పెట్టుకున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలయన్స్ జియో నుంచి దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్