Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని తరలింపా? ఏపీ విభజన చట్టంలో మార్పులు చేయాలి?

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (12:56 IST)
నవ్యాంధ్ర రాజధానిని మరో ప్రాంతానికి తరలించడం అనేది అసాధ్యమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ ఖచ్చితంగా రాజధానిని తరలించాల్సివస్తే కేంద్రం కల్పించుకుని ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో మార్పులు చేయాల్సివుంటుందని సుప్రీంకోర్టు న్యాయవాది ఎం. రామకృష్ణ అంటున్నారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉంటుందని, దాన్నికూడా లెజిస్లేచర్, జ్యూడిషియల్ క్యాపిటల్ అని ఎక్కడా పిలవరని... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలనే పిలుస్తారని తెలిపారు. 
 
అయితే, ఇప్పుడు రాజధానిని అమరావతి నుంచి విశాఖకు షిఫ్ట్ చేస్తున్నారని... అయితే చట్టంలో ఎక్కడా రిలోకేషన్ అని అనలేదని చెప్పుకొచ్చారు. వైజాగ్‌లో రాజధాని ఉండాలి అంటే అమరావతి నుంచి రీలోకేట్ చేయాలని తెలిపారు. రాజధాని తరలింపు అని చెప్పకుండా రాష్ట్ర పరిధిలో లేని అంశాలను ఈ చట్టంలో పెట్టారని ఆయన చెప్పారు.
 
అదేసమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఒకే చోట పెట్టమని 94(3)లో షల్ ప్రొవిడ్ అని ఉందని తెలిపారు. చట్టంలో అన్నీ కూడా ఒకేచోట ఉండాలని చెప్పారన్నారు. జ్యూడీషియల్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్‌లను వేరు చేయడానికి విభజన చట్టం అంగీకరించదని తేల్చిచెప్పారు. 
 
ఎక్కడ నుండి పరిపాలన సాగించాలి అనేది ఆర్టికల్ 4లో స్పష్టంగా ఉందని చెప్పారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన పరిపాలన వికేంద్రీకరణ చట్టంలో కూడా అనేక లోపాలు ఉన్నాయని అన్నారు. రాజధానిని తరలింపు చేయాలంటే కేంద్రం మరోసారి విభజన చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

Rashmika : హారర్‌ కామెడీ యూనివర్స్ చిత్రం థామా అలరిస్తుంది: రష్మిక మందన

Prabhas: ఫన్, ఫియర్, ఆల్ట్రా స్టైలిష్ గా ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్

Sudheer: ముగ్గురు నాయికలుతో సుడిగాలి సుధీర్ హీరోగా హైలెస్సో ప్రారంభం

OG Collections: ఓజీ నాలుగు రోజుల కలెక్లన్లు ప్రకటించిన డివివి ఎంటర్ టైన్ మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments