Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం జగన్‌కు పెద్దగా తెలుగు రాదు... అంత దారుణంగా అనడం సరికాదు... ఆర్ఆర్ఆర్

సీఎం జగన్‌కు పెద్దగా తెలుగు రాదు... అంత దారుణంగా అనడం సరికాదు... ఆర్ఆర్ఆర్
, సోమవారం, 31 ఆగస్టు 2020 (16:31 IST)
తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (ఆర్ఆర్ఆర్) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌కు తెలుగు పెద్దగా రాదని వ్యాఖ్యానించారు. పైగా, కరోనాతో సహజీవనం చేయాలంటూ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం సరికాదు అని వ్యాఖ్యానించారు. 
 
సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో రఘురామకృష్ణంరాజు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, 'అది కూడానా. ఇది ఇప్పటికిప్పుడు పోయేది కాదన్న కోణంలో ఆయనకు వచ్చిన తెలుగులో అలా చెప్పారు. ఆయనకు పెద్దగా తెలుగు రాదు. సహజీవనం అనే మాట అలా వాడారు. దాన్ని మీరు అంతదారుణంగా అనడం సరికాదు. 
 
కరోనాను సీరియస్‌గా చూడాలి. చాలా బాధపడాల్సిన విషయం. దీనిపై సమీక్షలు చేయకుండా... తెల్లారి లేస్తే కోర్టు కేసులు. విశాఖ వెళ్లిపోవాలన్న తొందర. కరోనా లాంటి విపవత్తుపై దృష్టి పెట్టాలి. రాబోయే రోజుల్లో వ్యవసాయం పనులు మొదలు అవుతాయి. ఇంత కష్టకాలంలో కరోనా విపత్తు కాలంలో ఫోకస్ చేయకుండా.. గ్రామ పరిస్థితులను వ్యవసాయ పనులను అంచనావేయకుండా.. కోర్టులతో మొట్టికాయలు తింటున్నారు' అని వ్యాఖ్యానించారు. 
 
తన పార్లమెంట్ నియోజకవగర్ంలో 30-35 మంది పేషంట్లు లేని గ్రామం లేదన్నారు. దేశంలోనే ఎక్కువగా ఏపీలో కరోనా కేసులు ఉన్నాయని తెలిపారు. రాజధాని కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని, ఆ సీ (క్యాపిటల్)కాకుండా ఈ సీ(కరోనా)పై దృష్టిపెట్టాలన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లాస్మా థెరపీతో మంచి ఫలితాలను సాధిస్తున్న నెల్లూరు జిల్లా