Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు విద్యార్థుల మృతి

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (08:45 IST)
గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద ఘోరం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. విజయవాడ నుంచి చిలకలూరు పేటకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలిలోనే ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. 
 
విజయవాడలోని ఓ కాలేజీలో ఆర్కిటెక్చర్ విద్యాభ్యాసం చేస్తున్న గౌతమ్ రెడ్డి (విజయవాడ), చైతన్య, పవన్ (కాకినాడ), సౌమ్యిక (విశాఖ)లు ఓ కారులో చిలకలూరిపేటకు బయలుదేరారు. ఈ కారు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద రోడ్డు పక్కన ఆగివున్న కారును ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచినట్టు తెలిసింది. కారు వేగంగా వస్తుండడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్టు భావిస్తున్నారు. కారు ముందు భాగం లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జయింది.

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో లేకపోవడం మీడియాకు కంటెంట్ లేదు.. రేయి పగలు జరిగే ప్రశ్న : నటుడు నవదీప్

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ తీశాడు : దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ

నార్నే నితిన్ చిత్రం ‘ఆయ్’ నుంచి రంగనాయకి సాంగ్ విడుదల

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఎండాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి... ఈ జాగ్రత్తలు పాటిస్తే..?

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

తర్వాతి కథనం
Show comments