Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు.. సత్తా చాటిన ఏపీ విద్యార్థులు

Advertiesment
students
, శుక్రవారం, 12 ఆగస్టు 2022 (13:53 IST)
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. శుక్రవారం జేఎన్టీయూ ప్రాంగణంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. తొలి ఐదు ర్యాంకుల్లో ఏపీ విద్యార్థులే అర్హత సాధించారు. 
 
ఇంజినీరింగ్ పరీక్షకు 1,56,812 మంది... అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల పరీక్షలకు 80,575 మంది హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్‌లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మరోవైపు టీఎస్ ఎంసెట్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సత్తా చాటారు. తొలి ఐదు ర్యాంకుల్లో ఏపీ విద్యార్థులే అర్హత సాధించారు. 

ఇంజినీరింగ్:
ఫస్ట్ ర్యాంక్ - పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి (హైదరాబాద్)
సెకండ్ ర్యాంక్ - నక్కా సాయి దీప్తిక (శ్రీకాకుళం జిల్లా, ఏపీ)
థర్డ్ ర్యాంక్ - పోలిశెట్టి కార్తికేయ (గుంటూరు జిల్లా, ఏపీ)
ఫోర్త్ ర్యాంక్ - పల్లి జలజాక్షి (శ్రీకాకుళం జిల్లా, ఏపీ)
ఫిఫ్త్ ర్యాంక్ - మెండ హిమ వంశీ (శ్రీకాకుళం జిల్లా, ఏపీ).

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిల్లర వ్యాపారులు- కిరణాల కోసం ‘75 పర్ 75’ ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్