భర్త కాదు మానవమృగం : కాలు విరిగి ఆస్పత్రి బెడ్‌పై ఉన్నా... కామ కోర్కె తీర్చమన్నాడు

ఆ భర్త మనిషి కాదు. ఓ మానవమృగం. కట్టుకున్న భార్యను కాలు విరగ్గొట్టడమేకాకుండా, కట్టుకుని ఆస్పత్రిలో బెడ్‌పై నడవలేని స్థితిలో ఉన్నా... నేలపైకి వచ్చి తన కామ కోర్తె తీర్చమన్నాడు. చివరకు పక్కబెడ్ రోగుల బంధు

Webdunia
ఆదివారం, 26 ఆగస్టు 2018 (15:23 IST)
ఆ భర్త మనిషి కాదు. ఓ మానవమృగం. కట్టుకున్న భార్యను కాలు విరగ్గొట్టడమేకాకుండా, కట్టుకుని ఆస్పత్రిలో బెడ్‌పై నడవలేని స్థితిలో ఉన్నా... నేలపైకి వచ్చి తన కామ కోర్తె తీర్చమన్నాడు. చివరకు పక్కబెడ్ రోగుల బంధువులు చూసి కేకలు వేయడంతో పారిపోయాడు. ఈ దారుణం శ్రీకాకుళం రూరల్  మండలంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
శ్రీకాకుళం రూరల్‌ మండలం కనుగులవానిపేటకు చెందిన జాడ నగేష్ అనే వ్యక్తి తొలి భార్య చనిపోవడంతో ఆమదాలవలస మండలం సోట్టవానిపేట గ్రామానికి చెందిన సుజాతను రెండో వివాహం చేసుకున్నాడు. ఈమెకు తల్లిదండ్రులు లేరు. ఓ సోదరుడు మాత్రమే ఉన్నాడు. మద్యంకు అలవాటున్న నగేష్‌ సుజాతపై తన పైశాచికత్వాన్ని ప్రదర్శించి, ఇంట్లో పిల్లలు ముందే అత్యంత దారుణంగా కామావాంఛ తీర్చమని వేధించేవాడు. 
 
ఈ క్రమంలో సుజాత తండ్రికి బీమా సొమ్ము వచ్చింది. ఈ డబ్బులు తీసుకుని రావాలంటూ నగేష్‌తో పాటు అత్త సరోజిని, ఆడపడుచు మాలతిలు వేధించసాగారు. అందుకు సుజాత నిరాకరించడంతో తినడానికి తిండి పెట్టకుండా అక్రమ సంబంధం అంటగడుతూ ప్రతీనిత్యం ప్రత్యక్ష నరకం చూపించారు. 
 
ఈ వేధింపులు భరించలేని సుజాత తన అక్క వద్దకు వెళ్ళిపోయింది. అయితే, ఈనె 12వ తేదీన భర్త నగేష్‌ అక్కడకు వెళ్లి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. డబ్బులు తెస్తేనే ఇంటికి రావాలని, లేదంటే నీ దారి నువ్వు చూసుకోవాలంటూ మరింతగా బెదిరించాడు. ఏంచేసిన ఆ డబ్బులతో తనకు సంబంధం లేదంటూ తెగేసి చెప్పడంతో మద్యం మత్తులో ఉన్న నగేష్ ఓ బండరాయితో ఆమెను హత్య చేయబోయాడు. దీంతో తప్పించుకునే క్రమంలో ఆమె ఎడమకాలిపై పడటంతో కాలు విరిగిపోయింది. నడవలేని స్థితిలో ఉన్న సుజాతను తన తమ్ముడు దగ్గరిలో ఉన్న జెమ్స్‌ ఆస్పత్రిల్లో చేర్పించాడు.
 
ఆ తర్వాత ఆస్పత్రిలో ఆపసోపాలు పడుతూ వైద్యం పొందుతున్న సుజాతను చూసిన వారంతా అయ్యో... రామా అనే వారే ఎక్కువ. ఇవేవి పట్టించుకోని తన భర్త అక్కడే మృగంలా మారాడు. ఆస్పత్రిలో చేరిన మూడు రోజులు తర్వాత అర్థరాత్రి 12 గంటల సమయంలో నగేష్‌ తన భార్య వద్దకు వెళ్లి అందరూ పడుకున్నారని తన కామ కోర్కె తీర్చాలని పట్టుబట్టాడు. కనీసం నడవలేని స్థితిలో ఉన్న సుజాతను నేలపైకి రావాలంటూ అక్కడే బలవంతం చేయబోయాడు. దీంతో పక్కనే ఉన్న రోగుల బంధువులు కేకలు పెట్టడంతో అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments