Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 30 వరకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (08:58 IST)
కరోనా కష్టకాలంలో ప్రయాణికులకు భారతీయ రైల్వే ఓ శుభవార్త చెప్పిది. ఈ నెలాఖరు వరకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్లు.. కోవిడ్ మార్గదర్శకాలకు లోబడి నడుపనున్నట్టు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. 
 
ఈ ప్రత్యేక రైళ్ళ వివరాలను పరిశీలిస్తే, రైలు నంబరు 02449-02450 షాలిమార్ ‌- సికింద్రాబాద్‌ మధ్య నడిచే ప్రత్యేక రైలు జూన్ 9, 16, 23, 30 తేదీల్లో షాలిమార్‌‌లో మధ్యాహ్నం 12.20కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.55కి సికింద్రాబాద్‌‌కు చేరుకుంటుంది. 
 
తిరుగు ప్రయాణంలో జూన్ 11, 18, 25, జులై 2వ తేదీల్లో ఇదే రైలు సికింద్రాబాద్‌‌లో ఉదయం 4 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.05కి షాలిమార్‌ చేరుతుంది.
 
ట్రైన్ నంబరు 02469-02470 హౌరా-యశ్వంత్‌ పూర్‌ మధ్య నడుస్తుంది. ఈ ప్రత్యేక రైలు జూన్ 10, 17, 24వ తేదీల్లో హౌరాలో మధ్యాహ్నం 12.40కి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.40కి యశ్వంత్‌ పూర్‌‌కు చేరుకుంటుంది. 
 
ఇదే రైలు తిరుగు ప్రయాణంలో 13, 20, 27వ తేదీల్లో యశ్వంత్‌ పూర్‌‌లో ఉదయం 5.15కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.25కి హౌరాకు చేరుకుంటుంది.
 
రైలు నంబరు 03253-03254 పాట్నా-బనాస్‌వాడీ మధ్య నడిచే వీకెండ్ స్పెషల్ ట్రైన్‌ను జూన్ 10వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments