Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 30 వరకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (08:58 IST)
కరోనా కష్టకాలంలో ప్రయాణికులకు భారతీయ రైల్వే ఓ శుభవార్త చెప్పిది. ఈ నెలాఖరు వరకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్లు.. కోవిడ్ మార్గదర్శకాలకు లోబడి నడుపనున్నట్టు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. 
 
ఈ ప్రత్యేక రైళ్ళ వివరాలను పరిశీలిస్తే, రైలు నంబరు 02449-02450 షాలిమార్ ‌- సికింద్రాబాద్‌ మధ్య నడిచే ప్రత్యేక రైలు జూన్ 9, 16, 23, 30 తేదీల్లో షాలిమార్‌‌లో మధ్యాహ్నం 12.20కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.55కి సికింద్రాబాద్‌‌కు చేరుకుంటుంది. 
 
తిరుగు ప్రయాణంలో జూన్ 11, 18, 25, జులై 2వ తేదీల్లో ఇదే రైలు సికింద్రాబాద్‌‌లో ఉదయం 4 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.05కి షాలిమార్‌ చేరుతుంది.
 
ట్రైన్ నంబరు 02469-02470 హౌరా-యశ్వంత్‌ పూర్‌ మధ్య నడుస్తుంది. ఈ ప్రత్యేక రైలు జూన్ 10, 17, 24వ తేదీల్లో హౌరాలో మధ్యాహ్నం 12.40కి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.40కి యశ్వంత్‌ పూర్‌‌కు చేరుకుంటుంది. 
 
ఇదే రైలు తిరుగు ప్రయాణంలో 13, 20, 27వ తేదీల్లో యశ్వంత్‌ పూర్‌‌లో ఉదయం 5.15కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.25కి హౌరాకు చేరుకుంటుంది.
 
రైలు నంబరు 03253-03254 పాట్నా-బనాస్‌వాడీ మధ్య నడిచే వీకెండ్ స్పెషల్ ట్రైన్‌ను జూన్ 10వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments