Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బ్లాక్ ఫంగస్ - అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్

ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బ్లాక్ ఫంగస్ - అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్
, బుధవారం, 9 జూన్ 2021 (13:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ చాపకిందనీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో ఈ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఏపీ సర్కారు అప్రమత్తమైంది. నిజానికి ఒకవైపు కరోనా, మరోవైపు బ్లాక్‌ ఫంగ్‌స రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 
 
రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే 1,600 కేసులు నమోదయ్యాయి. వారిలో 98 మంది చనిపోయారు. ప్రతి రోజు సగటున 80 మంది బ్లాక్‌ ఫంగస్‌ బారినపడుతున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య వందలకు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వైద్య నిపులు చెబుతున్నారు.
 
ఇప్పటికే పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే.. భవిష్యత్తులో కేసులతో పాటు మరణాలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల రెండో వారం పూర్తయ్యే నాటికి 2,100 కేసులు, మూడో వారం నాటికి సుమారు 2,700 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదవుతాయని ఆరోగ్యశాఖ అంచనా వేసింది. 
 
రాష్ట్రంలో పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఏర్పాట్లు మాత్రం చేయడం లేదు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో అత్యధికంగా 380 ఫంగస్‌ కేసులున్నాయి. చిత్తూరులో 200, కృష్ణాలో 195, అనంతపురం 166, కర్నూలు 160, విశాఖపట్నంలో 160 కేసుల వరకూ ఉన్నాయి. 
 
ఫంగస్‌ మరణాలు కూడా ఈ ఆరు జిల్లాల్లోనే అధికంగా నమోదవుతున్నాయి. విశాఖపట్నంలో ఇప్పటి వరకూ అత్యధికంగా 15 మంది బ్లాక్‌ఫంగ్‌సతో మృతి చెందారు. అదేసమయంలో బ్లాక్‌ ఫంగ్‌సకు మందుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఫంగస్‌ నుంచి బయటపడాలంటే యాంపోటెరిసిన్‌-బి ఇంజక్షన్లు, పోసోకోనజల్‌ ఇంజక్షన్లు, మందులు అవసరం. కానీ ఈ మందుల కొరత రాష్ట్ర వ్యాప్తంగా వేధిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కఠిన లాక్డౌన్‌లోనూ ఆగని అవినీతి... వెల్లువెత్తిన ఫిర్యాదులు