Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్‌ కుమార్‌కు సర్వీసు గండం... హోంశాఖకు ఫిర్యాదు!

ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్‌ కుమార్‌కు సర్వీసు గండం... హోంశాఖకు ఫిర్యాదు!
, బుధవారం, 9 జూన్ 2021 (12:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఐడీ విభాగం ఏడీజీగా సునీస్ కుమార్ ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనకు సర్వీస్ గండం ఏర్పడింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ సమస్య ఉత్పన్నమైంది. మతం మార్పుచుకున్న వారికి రిజర్వేషన్లు వర్తించవని హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో సునీల్ ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు అందింది. 
 
సునీల్‌కుమార్‌ సర్వీస్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ... లీగల్‌ రెట్స్‌ అడ్వైజరీ(ఎల్‌ఆర్‌వో) కన్వీనర్‌ ఎన్‌ఐ జోషి ఫిర్యాదు చేశారు. ఎస్సీ మాల పేరుతో రిజర్వేషన్‌ పొంది... క్రిస్టియన్‌గా మతం మార్చుకున్న సునీల్‌కుమార్‌ను సర్వీస్‌ నుంచి తప్పించాలని అందులో పేర్కొన్నారు. మతం మార్చుకున్న వారు రిజర్వేషన్‌ను వదలుకోవాలన్న... మద్రాస్‌ హైకోర్టు తీర్పు మేరకు సునీల్‌కుమార్‌ను సర్వీస్ నుంచి తొలగించాలని కోరారు. 
 
సర్వీస్‌ నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్‌ ఇండియా మిషన్‌ పేరుతో... సునీల్‌కుమార్‌ ప్రారంభించిన సంస్థపైనా పూర్తిస్థాయిలో విచారణ జరపాలని పేర్కొన్నారు. అంబేద్కర్‌ మిషన్‌ పేరుతో హిందూ వ్యతిరేక భావాలను సునీల్‌ ప్రోత్సహించారని, సునీల్‌కుమార్‌పై సెక్షన్‌ 153(ఏ), 295(ఏ) కింద ఎఫ్‌ఐఆర్‌ సమోదు చేసి... పూర్తిస్థాయిలో హోంశాఖ దర్యాప్తు చేయాలని ఎల్‌ఆర్‌వో కన్వీనర్‌ ఎన్‌ఐ జోషి డిమాండ్‌ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ బయోటెక్‌కు భారీ భద్రత : 64 మంది కమెండోలతో రక్షణ