Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ అధినేత చంద్రబాబుకు సోనుసూద్ ఫోనులో పరామర్శ

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (18:26 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బాలీవుడ్ నటుడు సోను సూద్ ఫోనులో పరామర్శించారు. హైదరాబాద్‌ నగరానికి వచ్చినపుడు మిమ్మలను కలుస్తానని చెప్పారు. పైగా ప్రజా సమస్యలకు వేదిక అయిన అసెంబ్లీ విధ్వంసానికి నిలయంగా మారడం దురదృష్టకరమని సోనుసూద్ అన్నారు. చంద్రబాబుతో ఫోనులో మాట్లాడిన విషయాన్ని సోనుసూద్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. కాగా, ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల అధికార వైకాపా సభ్యులు అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు, చంద్రబాబు నాయుడుపై వైకాపా నేతలు చేస్తున్న కామెంట్స్‌కు నారా రోహిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని చంద్రబాబు తల్లిదండ్రులు దివంగత నారా ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధుల వద్ద నారా రోహిత్ ఆదివారం మౌన నిరసన తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన పెదనాన్న చంద్రబాబు, పెద్దమ్మ భువనేశ్వరి, అన్న నారా లోకేశ్‌లు క్రమశిక్షణకు మారుపేరన్నారు. ముఖ్యంగా, పెద్దమ్మ భువనేశ్వరి సేవా కార్యక్రమాలే పరమావధిగా పని చేస్తున్నరన్నారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తిపై అన్నెన్ని నిందలు వేయడానికి వైకాపా నేతలకు నోరెలా వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments