Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుప్పంలో తెదేపా బొక్క బోర్లా... ఇక తండ్రీకొడులిద్దరూ తట్టాబుట్టా సర్దుకోవాలి : ఆర్కే రోజా

కుప్పంలో తెదేపా బొక్క బోర్లా... ఇక తండ్రీకొడులిద్దరూ తట్టాబుట్టా సర్దుకోవాలి : ఆర్కే రోజా
, బుధవారం, 17 నవంబరు 2021 (15:47 IST)
కుప్పం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. అధికార వైకాపా చెందిన అభ్యర్థులు విజయభేరీ మోగించింది. ముఖ్యంగా, టీడీపీకి కంచుకోటల్లో ఒకటిగా ఉన్న కుప్పంలో టీడీపీ అభ్యర్థి ఓడిపోగా, వైకాపా అభ్యర్థి విజయం సాధించింది. 
 
దీనిపై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా సెటైర్లు వేశారు. "తండ్రి.. కొడుకులిద్ద‌రూ త‌ట్టా, బుట్టా స‌ర్దుకుని హైద‌రాబాద్‌కి వెళ్ళిపోవాల‌ని ఎద్దేవా చేశారు. కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓట‌మితో ఇప్ప‌టికైనా బుద్ది వ‌చ్చి ఉంటుంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌లంతా సీఎం జ‌గ‌న్ వైపే ఉన్నార‌నే విష‌యం మ‌రోసారి రుజువైంద‌న్నారు.
 
నలబై ఏళ్ళు ఇండ్రస్టీ అయినా చంద్రబాబును కుప్పం ప్రజలు తరిమి కొట్టారని రోజా చురకలు అంటించారు. కుప్పంలోనే ఇల్లు లేని చంద్రబాబును… హైదరాబాద్ ఇంటికి పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని.. కుప్పం ప్రజలు జగన్ వెంటనే ఉన్నారని తెలిపారు. డిల్లీ చక్రం తిప్పుతాననే చంద్రబాబు…. కుప్పం మున్సిపాలిటీలు బోక్క బోర్ల పడ్డారని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప‌ది రోజులుగా కనిపించని ఛైర్మన్... ప్రైమ్ 9 ఉద్యోగుల ఆందోళ‌న‌!