Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాల్లో వేలాడుతున్న రైలు పట్టాలు - చెన్నై - విజయవాడ మార్గంలో రైళ్లు రద్దు

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (17:11 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ కారణంగా నదులు, వాగులు, వంకలు, చెరువులు ఏకమయ్యాయి. దీంతో వరద పోటెత్తింది. జలాశయాలన్నీ పూర్తిగా నిండిపోవడంతో నీటిని కిందికి వదిలివేశారు. ఫలితంగా అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 
 
ముఖ్యంగా, నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో పెన్నానది ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా కోవూరు వద్ద జాతీయ రహదారి తెగిపోయింది. నెల్లూరు రైల్వే స్టేషన్‌కు సమీపంలోని పడుగుపాడు వద్ద రైలు పట్టాలపై నీరు చేరాయి. ఆ తర్వాత కొన్ని క్షణాల్లో నీటి ప్రవాహానికి రైలు కట్ట తెగిపోయింది. ఫలితంగా రైలు పట్టాలు గాల్లో వేలాడుతున్నాయి. 
 
ఇటు రైల్వే ట్రాక్, అటు జాతీయ రహదారి తెగిపోవడంతో చెన్నై - విజయవాడ ప్రాంతాల మధ్య అన్ని రకాల వాహనరాకపోకలు స్తంభించిపోయాయి. అయితే, పడుగుపాడు వద్ద వరదనీటి ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. దీంతో రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అలాగే, జాతీయ రహదారిని సైతం మరమ్మతులు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments