Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ముఖేష్ కుమార్ మీనా

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (10:26 IST)
సీనియర్ ఐఎఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆర్థిక శాఖ (వాణిజ్య పన్నులు) కార్యదర్శిగా  బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్ మొదటి అంతస్తులో తన చాంబర్లో పూజాదికాలు నిర్వహించి బాధ్యతలు తీసుకున్నారు. ముఖేష్ కుమార్ మీనా  పరిశ్రమల (ఆహార శుద్ది) శాఖ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.
 
 
గతంలో ఎపి గవర్నర్ ఒఎస్డి గా బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించిన మీనా తర్వాత బదిలీ అయ్యారు. గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద ప‌నిచేసిన‌పుడు మీనా అటు గ‌వ‌ర్న‌ర్ కు, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వానికి వార‌ధిగా ప‌ని చేశార‌ని, వివాదాల‌కు తావు లేకుండా విధి నిర్వ‌హణ చేశార‌నే గుర్తింపును పొందారు. మొద‌టి నుంచి ముకేష్ కుమార్ మీనా సౌమ్యుడిగా, ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే పేరుంది.


ఇపుడు కొత్తగా ఆర్ధిక శాఖలో చేరిన మీనా మీడియాతో మాట్లాడుతూ,  ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు వాణిజ్య పన్నులను పూర్తి స్థాయిలో సమర్థ వంతంగా వసూలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. పన్ను ఎగవేత దారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. జీఎస్టీకి సంభందించిన ఇబ్బందులను అధిగమించేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తామని మీనా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments