Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతన్నల విజయం : కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటాం.. ప్రధాని మోడీ

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (09:46 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోనుంది. ఈ మేరకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో గత యేడాదిన్నర కాలంగా ఆందోళన చేస్తున్న రైతులు విజయం సాధించారు. 

 
కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం సాగింది. సాగు చట్టాలను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ వ్యాప్తంగా కిసాన్ ఉద్యమాలు హోరెత్తాయి. ముఖ్యంగా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ ఉద్యమం మరింత ఉధృతంగాసాగింది.

 
రైతులు ఢిల్లీ ఎర్రకోట వేదికగా చేపట్టిన ఆందోళన ఉధృతంగా మారింది. పైగా, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఇప్పటికీ ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

 
కేంద్రం తెచ్చిన మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆయన శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మూడు సాగు చట్టాల రద్దుపై తీర్మానం చేయనున్నట్టు ప్రకటించారు. ప్రధాని మోడీ తాజా ప్రకటనతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments