Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతన్నల విజయం : కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటాం.. ప్రధాని మోడీ

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (09:46 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోనుంది. ఈ మేరకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో గత యేడాదిన్నర కాలంగా ఆందోళన చేస్తున్న రైతులు విజయం సాధించారు. 

 
కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం సాగింది. సాగు చట్టాలను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ వ్యాప్తంగా కిసాన్ ఉద్యమాలు హోరెత్తాయి. ముఖ్యంగా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ ఉద్యమం మరింత ఉధృతంగాసాగింది.

 
రైతులు ఢిల్లీ ఎర్రకోట వేదికగా చేపట్టిన ఆందోళన ఉధృతంగా మారింది. పైగా, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఇప్పటికీ ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

 
కేంద్రం తెచ్చిన మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆయన శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మూడు సాగు చట్టాల రద్దుపై తీర్మానం చేయనున్నట్టు ప్రకటించారు. ప్రధాని మోడీ తాజా ప్రకటనతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments