Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు రూ.50 వేలు చెల్లించాల్సిందే.. జగన్ తరపు న్యాయవాదులకు కోర్టు హెచ్చరిక

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (09:32 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో తెలంగాణ హైకోర్టు గట్టి హెచ్చరిక చేసింది. పెండింగ్ కేసుల విచారణ సందర్భంగా వాయిదా కోరిని పక్షంలో రోజుకు రూ.50 వేల చొప్పున చెల్లించాల్సిందేనంటూ హెచ్చరిక చేసింది. జగన్ అక్రమాస్తులు కేసులు అనేకం ఉన్నాయి. ఇవి విచారణకు వచ్చినపుడు జగన్ తరపు న్యాయవాదులు చీటికి మాటికి వాయిదాలు కోరుతూ కాలయాపన చేస్తున్నారు. దీనిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై తప్పనిసరిగా వాదనలు వినిపించాల్సిందేనని లేకుంటే రోజుకు రూ.50 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 
 
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో తమపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు.. ఇతర పిటిషన్లపై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఇందులోభాగంగా దాల్మియా సిమెంట్స్‌కు చెందిన పునీత్ దాల్మియా దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు గడువు కావాలని ఆయన తరపు న్యాయవాదులు కోరారు. 
 
అలాగే జగన్ హాజరు మినహాయింపునకు సంబంధించిన పిటిషన్‌లో వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హాజరుకావాల్సి వుందని, అందువల్ల ఈ కేసు విచారణను ఒక రోజు వాయిదా వేయాలని కోరగా, హైకోర్టు పై విధంగా కీలక వ్యాఖ్యలు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం