Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఘా నీడలో తిరుమల తిరుపతి.. తస్మాత్ జాగ్రత్త..!

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (12:38 IST)
దేశంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో ఏపీలోని తిరుపతిలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.


దక్షిణాది రాష్ట్రాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్రం హెచ్చరించగా, తిరుమలతో పాటు ముఖ్యమైనటువంటి అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని పోలీసు అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో తిరుపతి నగరంలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో తనిఖీలు చేస్తున్నట్లు ఎస్పీ అన్బురాజన్‌ వెల్లడించారు.
 
ప్రయాణికులు, యాత్రికులు తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు చెప్తున్నారు. యాత్రికులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కానీ, వస్తువులు కానీ కనిపిస్తే వెంటనే డయల్‌ 100కు, పోలీస్‌ వాట్సప్‌ నెంబర్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక బాంబు, డాగ్‌ స్క్వాడ్లు రైల్వేస్టేషన్లు, బంస్టాండ్లు, అతిథి గృహాలు, దేవాలయాల్లో తనిఖీలు చేపట్టాయి. 
 
రేణిగుంట, శ్రీకాళహస్తి, తిరుమల ప్రాంతాలలో అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లగేజీని పరిశీలించి అనుమానాలు తీరిన తర్వాతే ఎవరినైనా వదిలిపెడుతున్నారు. శ్రీలంకలో ఉగ్రదాడులు జరిగిన తర్వాత ఉగ్రవాదులు భారత్‌ను టార్గెట్ చేసినట్లుగా ఇంటెలిజెన్స్ సమాచారం అందించిన సంగతి విదితమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments