Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియా ఎన్నికలు... పిట్టల్లా రాలుతున్న ఎన్నికల సిబ్బంది. ఎందుకు?

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (11:54 IST)
ఇండోనేషియాలో అధ్యక్ష పదవి కోసం ఏప్రిల్ 17న ఎన్నికలు జరిగాయి. దాదాపు 26 కోట్ల మంది ఉన్న జనాభా ఉన్న ఆ దేశంలో ఎన్నికల కమిషన్ ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించింది. ఇండోనేసియాలో 19 కోట్ల మంది ఓటర్లు ఉండగా 80 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఇక్కడ మన దేశంలో ఉన్నట్లు ఒక మనిషికి ఒక ఓటు కాకుండా ఒక్కో ఓటరు ఐదు బ్యాలెట్ పేపర్లలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. 
 
ఎన్నికల నిర్వహణ వరకు బాగానే జరిగినా ఆ తర్వాత కౌంటింగ్ సమయంలో సమస్యలు తలెత్తాయి. ఈ ఎన్నికల ఫలితాలను మే 22వ తేదీన వెలువరించాల్సి ఉన్నందున కోట్ల సంఖ్యలో ఉన్న బ్యాలెట్ పేపర్లను ఎన్నికల సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి మరీ కౌంటింగ్ చేయాల్సి వస్తోంది. దీంతో వందలాది మంది సిబ్బందికి అలసట ఎక్కువై తట్టుకోలేక ప్రాణాలను కోల్పోతున్నారు.

శనివారం వరకు 272 మంది ఎన్నికల సిబ్బంది ఒత్తిడిని తట్టుకోలేక చనిపోయారని, మరో 1,878 మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని ఎలక్షన్ కమిషన్ తెలియజేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి అధికారికి మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ఆరోగ్య శాఖ ఓ సర్కులర్ విడుదల చేసింది.

చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే యోచనలో ఆర్థికశాఖ ఉంది. ఇలా ఉండగా ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణలో ఘోర వైపల్యం చెందిందని, తగిన సిబ్బందిని ఏర్పాటు చేసుకోలేకపోవడం కారణంగానే ఇంతమంది చనిపోయారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments