Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు సలహా ఇచ్చిన వైకాపా రెబెల్ ఎంపీ ఆర్ఆర్ఆర్.. ఏంటిది?

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (11:03 IST)
వైకాపా అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఓ సలహా ఇచ్చారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో లక్ష్మీ పార్వతి పోషించిన పాత్రను ఇపుడు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడుగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి పోషిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో తమ నేత జగన్ మేల్కోకుంటే పార్టీలో సంక్షోభం తప్పదని వైకాపాకు చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, దివంగత ఎన్టీ.రామారావు ఎంత మంచివారైనప్పటికీ అప్పట్లో టీడీపీలో లక్ష్మీపార్వతి ప్రమేయం ఎక్కువ కావడంతో 1995లో టీడీపీ సంక్షోభం తలెత్తిందన్నారు. ఇపుడు వైకాపాలో సజ్జల కూడా అలానే వ్యవహరిస్తున్నారని, పరిస్థితి చేయిదాటక ముందే ఆయనను పక్కనబెట్టాలని, లేదంటే పార్టీ నేతల్లో అసంతృప్తి పెరిగిపోతుందని సీఎం జగన్‌కు సూచించారు. 
 
ఎమ్మెల్యేలను ఒకప్పటి సాక్షి పత్రిక విలేఖరి అయిన సజ్జలకు రిపోర్టు చేయాలని అనడం ఏమాత్రం భావ్యం కాదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ నలుగురు వైకాపా ఎమ్మెల్యేలు ఓటు వేయలేదని ఏ ప్రాతిపదికన చెబుతారన్న మాజీ మంత్రి, వెంకటగిరి వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్న న్యాయబద్ధంగా, సబబుగా ఉందని చెప్పారు. అలాగే, వైకాపా కోసం ఎన్నో త్యాగాలు చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయడం వైకాపా నేతలందరికీ సిగ్గుచేటు అని అన్నారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments