Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

ఠాగూర్
సోమవారం, 23 జూన్ 2025 (22:12 IST)
పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోందని, అందువల్ల ఎపుడు ఎన్నికలు జరిగినా విజయం మాత్రం తమదేనని ఆ పార్టీ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి జోస్యం చెప్పారు. ఆయన సోమవారం తాడేపల్లి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఏపీలో ఎపుడు ఎన్నికలు జరిగినా వైకాపా రికార్డు స్థాయిలో మెజార్టీతో విజయం సాధిస్తుందని, ఈ విషయంపై ప్రజల్లోనూ, పార్టీ శ్రేణులల్లోనూ బలమైన నమ్మకం ఉందన్నారు. 
 
కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ, వేధింపులకు గురిచేస్తోందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా.. ప్రజల మద్దతు మాకే ఉందని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ పథకాల అమలును పూర్తిగా విస్మరించారని రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. సామాన్యులు కూడా దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారని, పాలన పూర్తిగా గాడితప్పిందన్నారు. వచ్చే ఎన్నికల్లోనే కాకుండా ఇకపై మళ్లీ గెలవలేమన్న భయంతో కూటమి నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments