Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెడ్ బుక్‌ను లైట్‌గా తీసుకున్నాం.. 2 నెలల్లో మేమంతా జైలుకే : సజ్జల రామకృష్ణారెడ్డి

Advertiesment
sajjala ramakrishna reddy

ఠాగూర్

, ఆదివారం, 1 జూన్ 2025 (09:29 IST)
టీడీపీ చెప్పుకుంటూ వచ్చిన రెడ్ బుక్‌ను తాము లైట్‌గా తీసుకున్నామని, ఈ కారణంగా మరో రెండు నెలల్లో మేమంతా జైలుకు వెళతామని వైకాపా సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మా అందరిపై కేసులు ఉన్నాయని, మహా అయితే, మరో రెండు నెలలు లేదా ఎపుడైనా జైలుకు పోవచ్చన్నారు. అవినీతి కేసులో అరెస్టయి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డితో శనివారం సజ్జల ములాఖత్ నిర్వహించారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు మేం అధికారంలోకి వస్తే రెడ్ బుక్ పాలన ఉంటుందని పదేపదే చెప్పారని, ఆ మాటలను తాము లైట్‌గా తీసుకున్నామన్నారు. దాని పర్యావసానాలు ఇంత తీవ్రంగా ఉంటాయని ఇపుడు చూస్తున్నామన్నారు. కల్పిత కథలు సృష్టించి, వైకాపా నేతల పాత్రలు చేర్చి కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారన్నారు.
 
సోషల్ మీడియాతో మొదలై ఇపుడు పరాకాష్టకు చేరిందన్నారు. కాకాణి బలంగా మాట్లాడుతున్నపుడే ఆయనను టార్గెట్ చేస్తారని భావించామని, ఇపుడు తాము ఊహించినట్టుగానే జరిగిందన్నారు. రాష్ట్రంలో వైకాపా అనే ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని కూటమి పాలకులు చూస్తున్నారని, కానీ, ఎంత అణగదొక్కాలని చూస్తే అంత బలంగా పైకి లేస్తామని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇపుడు సీఎం చంద్రబాబు నాయుడు నాటిన విత్తనం... రేపు దాని ఫలాలు ఎలా ఉంటాయో ఆయన ఊహించడం లేదని, వైకాపా అధికారంలోకి వస్తే అవి భయంకరంగా ఉంటాయన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్