Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈరోజు అర్థరాత్రి నుంచి ఆర్టీసి బస్సులు తిరగవంతే...

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (15:39 IST)
ఏపీఆర్టీసీలో సమ్మె సైరన్ మ్రోగింది. గుర్తింపు కార్మిక సంఘం మరియు ఇతర కార్మిక సంఘాలు వివిధ సమస్యల పరిష్కారం కోసం జేఏసీగా ఏర్పడి మంగళవారం అర్థరాత్రి తర్వాత సమ్మకు దిగనున్నాయి. ఈ మేరకు 15 రోజుల క్రితమే సమ్మె నోటీసు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 రీజియన్లలో సమ్మె కోసం జేఏసీ నాయకులు సన్నాహక కార్యక్రమాలు చేపట్టారు. అప్పటి నుండి అన్ని డిపోల ఎదుట నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టి కార్మికులను సంఘటితం చేసారు. 
 
అధికారంలో ఉన్న పార్టీ మినహా ఇతర రాజకీయ పార్టీల మద్దతు కోరారు. కొన్ని యూనియన్‌లు మంగళవారం నుండే సమ్మెలో పాల్గొంనేందుకు సిద్ధంగా ఉండగా, ఆర్టీసీలో అధిక సభ్యత్వం గల నేషనల్ మజ్దూర్‌ యూనియన్‌ గురువారం అర్థరాత్రి నుంచి సమ్మెలో పాల్గొంటుంది. అన్ని కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటే దాదాపు 70 శాతం బస్సులు డిపోలకే పరిమితమవుతాయి. కేవలం 30 శాతం మాత్రమే అద్దె బస్సుల రూపంలో నడిచే అవకాశం ఉంది. 
 
ఆర్టీసీ అధికార యాజమాన్యం కార్మిక సంఘాలతో మంగళవారం నాడు మలిదశ చర్చలు జరిపే అవకాశం ఉంది. చర్చలు సఫలం కాకుంటే మాత్రం సమ్మె అనివార్యం అవుతుంది. సమ్మె ఎప్పుడు జరిగినా తిరుమల తిరుపతి బస్సులకు మినహాయింపుని కల్పిస్తున్న నాయకులు ఈ సారి మాత్రం అలా జరిగే అవకాశాలు ఉండవని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇదే జరిగినట్లయితే తిరుపతి తిరుమల మార్గంపై 50% ప్రభావం పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments