Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊరంతా కరెంట్ తీసి.. మీడియా కన్నుగప్పి...

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (15:29 IST)
ఎన్నారై జయరామ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మేనకోడలు శిఖా చౌదరిని అత్యంత గోప్యంగా హైదరాబాద్‌కు రలించారు. ఆమెను తరలింపునకు ముందు హైదరాబాద్ నగరంలో హైడ్రామా చోటుచేసుకుంది. 
 
ఈ హత్య కేసులో ఆమెను అరెస్టు చేసిన తర్వాత ఆమెను కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఐదు రోజుల పాటు ఉంచారు. అయితే, ఈ హత్య హైదరాబాద్‌లో జరగడంతో ఆమెను హైదరాబాద్ పోలీసులకు అప్పగించాలని భావించారు. ఇందుకోసం శిఖా చౌదరి ఎవరి కంటా కనిపించకుండా ఉండాలా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. 
 
సోమవారం రాత్రి అత్యంత నాటకీయ పరిణామాలు, హైడ్రామా మధ్య రహస్య ప్రాంతానికి తరలించారు. ఊరంతా కరెంట్ తీసేసిన పోలీసులు, అంతకుముందే రెండు వాహనాలను స్టేషన్ ముందు సిద్ధం చేసివుంచారు. ఒక వాహనంలో శిఖాను ఎక్కించారు. ఏ వాహనంలో ఆమె ఉందో మీడియా కంటపడకుండా జాగ్రత్త పడ్డారు. 
 
ఆపై రెండు వాహనాల్లో ఒకటి విజయవాడవైపు, మరొకటి హైదరాబాద్ వైపు వెళ్లిపోయాయి. ఈ వాహనాలను మీడియా వెంబడించినా, ఆమె ఎందులో ఉందన్న విషయం మాత్రం తెలుసుకోలేకపోయారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments