Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల నుంచి భూములు సేకరించాలి : సీఎం జగన్

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (17:00 IST)
సోలార్, విండ్ పవర్ సంస్థల కోసం రైతుల నుంచి భూములను సేకరించాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ భూములు ఇచ్చేందుకు రైతులను ప్రోత్సహించి, వారిని ఒప్పించేలా ఎమ్మెల్యేలు, ఎంపీలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
నంద్యాల జిల్లాలో  నిర్మించిన రామ్ కో సిమెంట్స్ పరిశ్రమను సీఎం జగన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోలార్, విండ్ పవర్ సంస్థల కోసం భూమిలిచ్చే రైతులకు యేడాదికి రూ.30 వేల చొప్పున లీజు ధర చెల్లిస్తామని తెలిపారు. 
 
ఈ మేరకు రైతులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటామని తెలిపారు. ప్రభుత్వం రైతులతో ఒప్పందం చేసుకుని, సౌర, పవన విద్యుత్ సంస్థలకు ఇస్తుందన్నారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి ఐదు శాతం మేర లీజుధరను పెంచుతుందని తెలిపారు. 
 
ఒక్కో లొకేషన్‌లో కనీసం 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగేలా భూసేకరణ జరగాలని చెప్పారు. ఆ మేరకు రైతులు భూములు ఇచ్చేలా వారిని ఒప్పించేలా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని అన్నారు. ఈ గ్రీన్ గో ప్రాజెక్టుల నిర్మాణాలకు రైతులు కూడా సహకరించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments