Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచాలు ఇచ్చేందుకు రూ.188 కోట్ల నిధులు కేటాయింపు

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (16:32 IST)
భారతదేశంలో తమ పనులు సక్రమంగా సాగే నిమిత్తం అధికారులకు లంచాలు ఇచ్చేందుకు ప్రముఖ టెక్ కంపెనీ ఒరాకిల్ ఏకంగా రూ.188 కోట్ల నిధులను కేటాయించింది. ఈ సంస్థ భారీగా అవకతవకలకు పాల్పడినట్టు అమెరికా సెక్యూరిటీస్ ఎక్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) గుర్తించింది. భారత్, యూఏఈ, టుర్కీ దేశాల్లో అధికారులకు లంచాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా 3.30 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో రూ.188 కోట్లు) కేటాయించినట్టు గుర్తించింది. ఇది విదేశీ అవినీతి కార్యకలాపాల చట్టం (ఎఫ్‌సీపీఏ) ఉల్లంఘనే అవుతుందని పేర్కొంది. 
 
ముఖ్యంగా ఒరాకిల్ ఇండియా విభాగం రైల్వేశాఖ ఆధ్వర్యంలోని ఓ రవాణా సంస్థకు భారీ రాయితీ ఇచ్చినట్టు ఎస్.ఈ.సి వెల్లడించింది. ఓ సాఫ్ట్‌వేర్ కాంపోనెంట్ విషయంలో తీవ్ర పోటీ ఉన్నందన ఒప్పందం చేజారకుండా ఉండేందుకు ఈ రాయితీ ఇవ్వాల్సి వస్తుందని సేల్ సిబ్బంది ఒరాకిల్ ఉన్నతాధికారులకు తెలియజేయగా, అందుకు వారు వెంటనే అనుమతి ఇచ్చినట్టు ఎస్ఈసీ విచారణలో వెల్లడైంది. 
 
అయితే, ఒరాకిల్‌పై ఎస్ఈసీ కన్నెర్ర చేయడం ఇది తొలిసారికాదు. పదేళ్ల కిందట కూడా ఒరాకిల్ ఇండియా విభాగంపై ఆరోపణలు రాగా, ఎస్ఈసీ రూ.16 కోట్ల జరిమానా వడ్డించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments