Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెంట్‌ బిల్‌ చూసి ఆ హోటల్‌ యజమాని షాక్‌.. ఏమైందంటే?

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (21:45 IST)
Hotel
హోటళ్లకు కరెంటు బిల్లు వందల్లో లేదా వేలల్లో వస్తుంటుంది. కానీ ఓ హోటల్‌కు వచ్చిన కరెంట్‌ బిల్‌ చూసి ఆ హోటల్‌ యజమాని షాక్‌కు గురయ్యారు. పూట గడవడం కోసం ఏదో ఓ చిన్న హోటల్‌ నడుపుకుంటుంటే.. సెప్టెంబర్‌ నెలలో వచ్చిన కరెంట్‌ బిల్‌ చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. 
 
ఎందుకంటే.. తన జీవితాంతం ఆ హోటల్‌ నడిపి సంపాదించినా.. తన మొత్తం ఆస్తులను ఆమ్మినా కూడా ఆ బిల్లు కట్టలేరు. ఇంతకీ విద్యుత్‌ అధికారులు ఆ యజమానికి వేసిన బిల్లు ఎంతో తెలుసా? వందలు కాదు.. వేలు కాదు.. లక్షల్లో కూడా కాదు.. ఏకంగా కోట్లలో వేశారు.
 
ఇలాంటి విషయం తెలిస్తే.. ఎవరు మాత్రం షాక్‌కు గురి కాకుండా ఉంటారు. ఈ ఘటన జరిగింది ఎక్కడో వేరే దేశాల్లోనో, రాష్ట్రాల్లోనో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చింతలపూడిలో శ్రీ సాయి నాగమణి ఓ టిఫిన్‌ హోటల్‌ నడుపుతున్నారు. 
 
ఎప్పటిలాగే ఆగస్టు నెలకు సంబంధించిన కరెంట్‌ బిల్లు వచ్చింది. అయితే ఈసారి ట్రూఅప్‌ చార్జీలతో కలిపి వేశారు. అయితే, రూ.21,48,62,224 విద్యుత్‌ బిల్లు రావడంతో హోటల్‌ యజమాని అవాక్కయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments