Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలులో కలకలం : రోడ్డు పక్కనే కరోనా మృతుల ఖననం

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (10:11 IST)
కరోనా వైరస్ దెబ్బకు కర్నూలు పట్టణంలో అలజడి చెలరేగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదైన జిల్లాగా ఇది పేరుగడించింది. దీంతో కర్నూలు పట్టణ ప్రాంత ప్రజల భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో అలజడి చెలరేగింది. 
 
ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి మృతదేహాలను రోడ్డు పక్కనే ఖననం చేశారు. ఈ ఖననం చేసిన తర్వాత చేతి గ్లౌజులు, పీపీఈ కిట్లను కూడా అక్కడే పడేసి వెళ్లిపోయారు. దీంతో స్థానికులు హడలిపోతున్నారు. వీటివల్ల ఇతరులకు కరోనా సోకే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారు. 
 
పట్టణంలోని ప్రజా నగర్, వెంకన్న బావి, దిన్నదేవరపాడు గ్రామాలకు చెందిన ప్రజలు అందించిన సమాచారం మేరకు.. కరోనా వైరస్ బారినపడి చనిపోయిన వారి మృతదేహాలను అధికారులు శ్మశానవాటికల్లో కాకుండా, జాతీయ రహదారుల పక్కన పూడ్చిపెడుతున్నారని చెప్పారు. 
 
పైగా వారు ధరించిన పీపీఈ కిట్స్, చేతి గ్లౌజులు కూడా అక్కడే వదిలిపెట్టి వెళ్లారని తెలిపారు. వాస్తవానికి వీటిని కాల్చివేయాల్సివుంది. అధికారుల నిర్లక్ష్యపూరిత చర్యల వల్ల ఈ వైరస్ మరింతగా వ్యాపించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments