Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఇంట్లో ఆరుగురికి 'కరోనా' సోకింది : కర్నూలు వైకాపా ఎంపీ

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (09:59 IST)
కర్నూలు జిల్లాలో అధికార వైకాపాకు చెందిన పార్లమెంట్ సభ్యుడు సంజీవ్ కుమార్ కుటుంబ సభ్యులను కరోనా వైరస్ కాటేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు సభ్యులు ఈ వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఎంపీగారే స్వయంగా వెల్లడించారు. 
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కేసుల్లో అగ్రస్థానంలో ముంది. ముఖ్యంగా, కర్నూలు కరోనా హాట్‌స్పాట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ ఇంటికి ఈ వైరస్ వ్యాపించింది. ఫలితంగా ఆరుగురికి సోకింది. 
 
ఇందులో ఎంపీకి చెందిన ఇద్దరు సోదరులు, వీరి భార్యలు, ఒకరి కుమారుడికి, 83 ఏళ్ల తండ్రికి సోకినట్లు ఎంపీ వెల్లడించారు. అయితే, తండ్రి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. 
 
కరోనా సోకిన ఈ ఆరుగురిలో నలుగురు వైద్యులు ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశం. వీరంతా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, లాక్‌డౌన్ వల్ల అంతగా ఉపయోగం ఉండడంలేదని, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా సోకుతుందని ఎంపీ అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments