Webdunia - Bharat's app for daily news and videos

Install App

విపత్కరమైన పరిస్థితుల నుంచి జనాన్ని బయటపడేస్తున్న రోజా

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (22:36 IST)
ప్రస్తుతం కరోనా మహమ్మారి బారినపడి చాలామంది చనిపోతున్నారు. ఇళ్ళు వదిలి బయటకు రాకూడదని చాలామంది అనుకుంటున్నా.. కొంతమంది యువత మాత్రం ఏమీ కాదులే అనుకుని రోడ్లపై ఇష్టానుసారంగా తిరిగేస్తున్నారు. మరికొంతమంది మాత్రం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు. అవసరమైతే తప్ప రోడ్లపైకి రావడం లేదు. 
 
అయితే ప్రభుత్వాలు మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఎప్పుడూ బిజీగా ఉండే నగరి ఎమ్మెల్యే రోజా తన నియోజకవర్గ ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. లాక్ డౌన్‌తో ఎవరూ పస్తులు ఉండకూడదని ఇప్పటికే ఆమె తన సొంత ట్రస్ట్ రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా బియ్యం, కందిపప్పును అందజేశారు.
 
అలాగే మరికొన్ని నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. అంతే కాకుండా నిరాశ్రయులు, నిరుపేదలు, అభాగ్యుల కోసం ప్రత్యేకంగా మధ్యాహ్నం పూట భోజనం కూడా పెడుతున్నారు. అంతే కాకుండా నియోజకవర్గంలో తిరుగుతూ కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరూ ఇంటి నుంచి రావద్దని కోరుతున్నారు. 
 
ఎప్పుడూ బిజీగా ఉండే రోజా నగరిలో ఇంటి పట్టునే ఉంటూ ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. ఎవరికీ కరోనా వైరస్ సోకుండా జాగ్రత్తపడుతున్నారు. నగరి, పుత్తూరు మున్సిపల్ అధికారులతో చర్చిస్తున్న రోజా అప్రమత్తంగా ఉండాలని ఆదేశిస్తున్నారు. ప్రజాప్రతినిధిగా రోజా చేస్తున్న సేవలను పలువురు కొనియాడుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments