Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్‌లో కాదు 29నే రేషన్‌.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (05:23 IST)
కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రేషన్‌ను ఈ నెల 29నే ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇవ్వనుంది.

దీంతోపాటు ఒక్కో కార్డుదారుడికి రూ.వెయ్యి నగదు కూడా అందజేయనున్నట్లు సీఎస్‌ నీలం సాహ్ని సోమవారం ఉత్తర్వులిచ్చారు. కరోనాను నియంత్రించేందుకు ఇప్పటికే సర్కారు బయోమెట్రిక్‌ విధానాన్ని ఎత్తివేసిన సంగతి తెలిసిందే. 
 
ఉత్తర్వుల్లో ముఖ్యాంశాలు.. 
- ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన బియ్యం, ఒక కేజీ కందిపప్పును కార్డుదారులకు ఉచితంగా ఇస్తున్నాం. 
- వాస్తవానికి ఇవి ఏప్రిల్‌లో ఇవ్వాల్సి ఉంది. కానీ, మార్చి 29నే ఇస్తున్నాం 
- ఉచితంగా రేషన్‌తో పాటు రూ.వెయ్యి నగదు కూడా అందజేస్తున్నాం. 
- ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ లేదా కాంట్రాక్టు ఉద్యోగస్తులకు కూడా సకాలంలో వేతనాలు అందిస్తాం. 
- ప్రైవేటు సంస్థలు కూడా విధిగా తమ సిబ్బందికి వేతనాలు చెల్లించాలి. 
- నిబంధనలు అతిక్రమించిన సంస్థలపై చర్యలు తీసుకుంటాం 
- నిత్యావసరాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులకు గురిచేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments