అమరావతి భూములపై సీబీ'ఐ'

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (05:17 IST)
రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ ఆది నుంచి ఆరోపణలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం.. వాటిని తేల్చేందుకు సీబీఐ తో దర్యాప్తుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో భూకొనుగోళ్లలో భారీగా అక్రమాలు, అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయంటూ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి పేరుతో అక్రమాలకు పాల్పడినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది.

దీనిపై మంత్రివర్గ ఉప సంఘం అన్ని రికార్డులను పరిశీలించి వివరాలు సేకరించి గతేడాది డిసెంబర్‌ 27న నివేదిక ఇచ్చింది. ఓత్‌ ఆఫ్‌ సీక్రెసీ (అధికారిక రహస్యాలు వెల్లడించననే ప్రమాణాన్ని)ని ఉల్లంఘించినట్టు మంత్రివర్గ ఉప సంఘం నిర్ధారించింది.

రాజధానిపై తమ వాళ్లకు ముందస్తు లీకులు ఇవ్వడంతో 2014 జూన్‌ నుంచి డిసెంబర్‌లోపు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా సీఆర్‌డీఏ పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,069.94 ఎకరాల భూ కుంభకోణం జరిగినట్టు నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments