Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఏపీలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత

ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఏపీలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత
, శనివారం, 21 మార్చి 2020 (15:55 IST)
ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. కరోనాపై ప్రధాని పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఈ అర్ధరాత్రి నుంచే నిలిపివేయనున్నట్టు చెప్పారు.

ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు. "జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ సర్వీసులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాం . ఉదయం నుండి రాత్రి వరకు రాష్ట్రంలో  ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేస్తున్నాం.

ఈ రోజు రాత్రి నుండే దూర సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నాం. ప్రైవేట్ సర్వీస్లను కూడా నిలిపి వేయమని కోరాం. రేపు రాత్రి నుండి సర్వీసులన్నింటినీ పునరుద్దిరిస్తాం. కరోనా వ్యాప్తి నివారణ చర్యలలో  భాగంగా ప్రధాని మోదీ స్వచ్చంద జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రయాణీకులంతా సహకరించాలి.

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర సరిహద్దుల్లో ప్రైవేట్ వాహనాల రాకపోకలను నిలిపి వేసింది. కేవలం ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రం నుండి తమిళనాడు వెళ్లే ప్రయాణీకులు తమ ప్రయాణాలు మానుకోవాలి" అని మంత్రి పేర్ని నాని కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11 వేల మంది మరణించారు, మనకు రాదులే అనే ధీమా వద్దు, జాగ్రత్త: WHO