Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా హత్యకు కుట్ర... ఎవరైనా నచ్చకపోతే జగన్ తీసేస్తుంటారన్న ఆర్ఆర్ఆర్

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (19:16 IST)
వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్ర జరుగుతుందంటూ ఆరోపించారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కిరాయి ముఠా సభ్యులతో ఈ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌కు ఎవరైనా నచ్చకపోతే తీసేస్తుంటారంటూ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీకి అన్ని వివరాలతో లేఖ రాస్తానని వెల్లడించారు. 
 
అలాగే, గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ కార్యకర్త హత్య కేసుపై రఘురామ రాజు స్పందించారు. చంద్రయ్యను ఎంతో దారుణంగా హత్య చేశారన్నారు. వ్యవస్థ నచ్చకపోయినా, వ్యక్తి నచ్చకపోయినా సీఎం జగన్ తీసేస్తుంటారన్నారు. 
 
అయితే, తమ ప్రభుత్వానికి, ఓ ఆంగ్ల పత్రికకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, అందువల్ల ఆపత్రికో చిరంజీవిని రాజ్యసభకు పంపుతున్నారంటూ వచ్చిన కథనంపై రఘురామరాజు కూడా స్పందించారు. 
 
అయితే రాజ్యసభ సీటు కోసం చిరంజీవి వైకాపాలో చేరుతారని తాను భావించడం లేదన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే పనిని చిరంజీవి చేయరని తాను భావిస్తున్నట్టు చెప్పారు. 
 
అయినప్పటికీ సినీ పరిశ్రమ సమస్యలు చిరంజీవి వివరించకుంటే సీఎం జగన్‌కు తెలియవా అని ప్రశ్నించారు. సినీ రంగానికి ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తే న్యాయం చేయడానికి కోర్టులు ఉన్నాయన్నారు. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments