Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి సభకు వచ్చిన ఆర్ఆర్ఆర్ - ఘన స్వాగతం పలికిన రైతులు

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (16:19 IST)
తిరుపతి పట్టణ వేదికగా అమరావతి రైతులు చేపట్టిన భారీ బహిరంగ సభకు వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు హాజరయ్యారు. ఆయనకు అమరాతి రైతులు ఘన స్వాగతం పలికారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది రాజకీయ సభ కాదని, దగాపడిన రైతు సభ అని అన్నారు. రైతులకు మద్దతుగా అన్ని వర్గాల వారు తరలివస్తున్నారన్నారు. వంద శాతం అమరావతే రాజధానిగా ఉంటుందని, ఈ విషయంలో ఏ ఒక్కరూ ఆందోళన చెందనక్కర్లేదన్నారు. 
 
నవ్యాంధ్రకు అమరావతే శాశ్వత రాజధాని, అడ్డుపడే మేఘాలు అశాశ్వతమని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మంచివాడని తాను చెప్పనని, కానీ చెడ్డవాడు మాత్రం కాదని చెప్పారు. ఎవరో చెప్పమన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారని అన్నారు. 
 
మరోవైపు, అమరావతి రైతు బహిరంగ సభకు రాలేమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. ఈ మేరకు ఆయన అమరావతి జేఏసీకి ఆయన లేఖ రాశారు. 
 
ఈ సభకు తనను ఆహ్వానించినందుక ధన్యవాదాలని చెబుతున్నామన్నారు. అయితే, అమరావతి నిర్మాణానికి, రాష్ట్రాభివృద్ధికి ఆటంకంకా ఉన్న బీజేపీతో తాము వేదికను పంచుకోలేమని చెప్పారు. సభకు రాలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments