Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవంబరు 1 నుంచి అమరావతి రైతుల మహాపాదయాత్ర

నవంబరు 1 నుంచి అమరావతి రైతుల మహాపాదయాత్ర
, బుధవారం, 27 అక్టోబరు 2021 (16:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని తరలింపును నిరసిస్తూ గత యేడాదన్నర కాలానికిపైగా ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి మహాపాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా ఆదివారం వెలగపూడిలో అమరావతి జేఏసీ నేతలు సన్నాహక సమావేశం నిర్వహించారు. 
 
ఇందులో మహాపాదయాత్ర విధి, విధానాలు, నిర్వహణ కమిటీల ఏర్పాటు సహా పలు విషయాలపై చర్చించారు. తుళ్లూరు నుంచి తిరుమల తిరుపతి వరకు మొత్తం 45 రోజులపాటు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. 
 
అంటే నవంబరు 1న మొదలై డిసెంబరు 17న ముగుస్తుంది. ఆ రోజు నాటికి ఉద్యమం ప్రారంభమై రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు.
 
మరోవైపు, రాజధానికి రైతులు ఇచ్చిన భూములకు ప్రభుత్వం వెంటనే కౌలు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మైనార్టీ, దళిత, యువజన జేఏసీ నాయకులు రాయపూడి సీడ్‌యాక్సెస్ రోడ్డు పక్కన ఉన్న ప్రజాప్రతినిధుల భవన సముదాయాల వద్ద నిరసన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ రాష్ట్రంలో మరొ కొత్త పార్టీ.. డాక్టర్ వినయ్ నేతృత్వంలో?