Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవంబర్ 1వ తేదీ నుంచి రైతులు మహా పాదయాత్ర

నవంబర్ 1వ తేదీ నుంచి రైతులు మహా పాదయాత్ర
, శనివారం, 23 అక్టోబరు 2021 (09:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలని కోరుతూ నవంబర్ 1వ తేదీ నుంచి రైతులు మహా పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మహా పాదయాత్రకు పలువురి మద్దతును రైతులు కోరుతున్నారు.

మహా పాదయాత్రకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతును రాజధాని రైతుల ప్రతినిధులు కోరారు. శుక్రవారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్‌ను రైతులు కలిసారు. ఈ మహా పాదయాత్ర తుళ్ళూరు గ్రామం నుంచి తిరుమల వరకు 45 రోజులపాటు సాగనుంది.

డిసెంబర్ 17వ తేదీతో పాదయాత్ర ముగియనుంది. దాదాపు రెండేళ్లుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అమరావతి పరిరక్షణలో భాగంగా మహా పాదయాత్ర తలపెట్టినట్లు రైతులు చెప్పారు. రాజధాని కోసం మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

పవన్ కళ్యాణ్, మనోహర్‌లు మహా పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని రైతులు, జేఏసీ నేతలలు విజ్ఞప్తి చేసారు. రైతుల మహా పాదయాత్ర  విజయవంతం కావాలని మనోహర్ ఆకాంక్షించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తైవాన్‌ను రక్షిస్తా: జో బైడెన్