Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా పార్టీ వాళ్లు హత్యలు.. అత్యాచారాలు చేసినా కాపాడేందుకు పెద్దలున్నారు : ఆర్ఆర్ఆర్

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (16:47 IST)
తమ పార్టీ వారు హత్యలు, అత్యాచారాలు చేసినా కాపాడుకునేందుకు తమ పార్టీలో పెద్దలు ఉన్నారని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఏపీలోని వైకాపా ప్రభుత్వం నిర్ణీత గడువులోగా చార్జిషీట్ దాఖలు చేయలేక పోవడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. పైగా, తమ పార్టీ వాళ్లు ఏం చేసినా కాపాడేందుకు ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. 
 
అనంతబాబుకు బెయిల్ మంజూరు కావడంతో ఆర్ఆర్ఆర్ స్పందిస్తూ, అనంతబాబు తమ పార్టీవాడు కాబట్టే కాపాడుకున్నామని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చార్జిషీట్ దాఖలు చేయలేకపోవడంతో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందని గుర్తుచేశారు. తమ పార్టీలో వాళ్లు హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా కాపాడటానికి తమ ప్రభుత్వ పెద్దలు ఉంటారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని, చివరుక కార్పొరేషన్లను కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments