Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా పార్టీ వాళ్లు హత్యలు.. అత్యాచారాలు చేసినా కాపాడేందుకు పెద్దలున్నారు : ఆర్ఆర్ఆర్

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (16:47 IST)
తమ పార్టీ వారు హత్యలు, అత్యాచారాలు చేసినా కాపాడుకునేందుకు తమ పార్టీలో పెద్దలు ఉన్నారని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఏపీలోని వైకాపా ప్రభుత్వం నిర్ణీత గడువులోగా చార్జిషీట్ దాఖలు చేయలేక పోవడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. పైగా, తమ పార్టీ వాళ్లు ఏం చేసినా కాపాడేందుకు ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. 
 
అనంతబాబుకు బెయిల్ మంజూరు కావడంతో ఆర్ఆర్ఆర్ స్పందిస్తూ, అనంతబాబు తమ పార్టీవాడు కాబట్టే కాపాడుకున్నామని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చార్జిషీట్ దాఖలు చేయలేకపోవడంతో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందని గుర్తుచేశారు. తమ పార్టీలో వాళ్లు హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా కాపాడటానికి తమ ప్రభుత్వ పెద్దలు ఉంటారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని, చివరుక కార్పొరేషన్లను కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments