Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశోకగజపతి రాజుపై కేసు ... ఐపీసీ 473, 353 సెక్షన్ల కింద

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (10:17 IST)
కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రామతీర్థం బోడికొండ ఆలయ ధర్మకర్త అశోకగజపతి రాజుపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. రామాలయ పునర్ నిర్మాణ శంకుస్థాపన కేసులో ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు అశోకగజపతిరాజుకు మధ్య వివాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా నెలిమర్ల పోలీసులు అశోకగజపతి రాజుపై ఐపీసీ 473, 353 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. 
 
బుధవారం విజయనగరం జిల్లా నెలిమర్లలో రామాలయ పునర్‌నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. దీనికి మంత్రి వెల్లంపల్లితోపాటు అశోకగజపతి రాజు కూడా వచ్చారు. ఈ ఆలయ శంకుస్థాపనకు తనను కొబ్బరికాయ కొట్టకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని అసహనం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. 
 
ఇదేసమయంలో శిలాఫలకం బోర్డును తొలగించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు సాయంతో మంత్రులు శిలాఫలకం ఏర్పాటుచేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి, విధులకు ఆటంకం కలిగంచారని ఆలయ ఈవో ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అశోకగజపతి రాజుపై కేసు నమోదు చేశారు. 
 
ఈ వ్యవహారంపై మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ, ఆలయ ధర్మకర్తగా అశోకగజపతి రాజును ఆహ్వానించడం జరిగిందన్నారు. ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఎక్కడా ప్రోటోకాల్ తప్పలేదని స్పష్టంచేశారు. అయితే, ఈ కార్యక్రమానికి రావడం అశోకగజపతి రాజుకు ఇష్టంలేనట్టుగా ఉందని అందుకే గంటముందే చేరుకుని వీరంగ్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments