Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరస్కరించిందనీ పెట్రోల్ పోసి నిప్పంటించాడు...

Webdunia
ఆదివారం, 16 జూన్ 2019 (11:56 IST)
తన ప్రేమను తిరస్కరించిందనీ ఓ మహిళా పోలీసు అధికారిణిపై పెట్రోల్ పోసి నిప్పటించాడో కిరాతకుడు. ఈ దారుణం కేరళ రాష్ట్రంలోని ఆలప్పుళా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, వల్లికున్నం పోలీస్ స్టేషన్‌లో సౌమ్య పుష్కరణ్ (31) అనే మహిళ పోలీసు అధికారిణిగా పని చేస్తోంది. 
 
ఈమె శనివారం తన విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అజాస్ కారులో వచ్చి ఆమె ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ఆమె కిందపడిపోయింది. ఆ తర్వాత లేచి అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, కారుతో వెంబడించి, ఆ తర్వాత గొడ్డలితో నరికి, శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమె ఆర్తనాదాలు చేస్తూ రోడ్డుపై పరుగులు తీస్తూ కిందపడిపోయి ప్రాణాలు విడిచింది. 
 
దీనిపై కొందరు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అజాద్‌ను అరెస్టు చేశారు. నిందితుడు వద్ద జరిపిన విచారణలో... తమ మధ్య గతంలో ప్రేమ వ్యవహారం కొనసాగిందనీ, అయితే, పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయగా, ఆమె అంగీకరించలేదని చెప్పారు. ఆ కోపంతోనే హత్య చేసినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments