Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరస్కరించిందనీ పెట్రోల్ పోసి నిప్పంటించాడు...

Webdunia
ఆదివారం, 16 జూన్ 2019 (11:56 IST)
తన ప్రేమను తిరస్కరించిందనీ ఓ మహిళా పోలీసు అధికారిణిపై పెట్రోల్ పోసి నిప్పటించాడో కిరాతకుడు. ఈ దారుణం కేరళ రాష్ట్రంలోని ఆలప్పుళా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, వల్లికున్నం పోలీస్ స్టేషన్‌లో సౌమ్య పుష్కరణ్ (31) అనే మహిళ పోలీసు అధికారిణిగా పని చేస్తోంది. 
 
ఈమె శనివారం తన విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అజాస్ కారులో వచ్చి ఆమె ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ఆమె కిందపడిపోయింది. ఆ తర్వాత లేచి అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, కారుతో వెంబడించి, ఆ తర్వాత గొడ్డలితో నరికి, శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమె ఆర్తనాదాలు చేస్తూ రోడ్డుపై పరుగులు తీస్తూ కిందపడిపోయి ప్రాణాలు విడిచింది. 
 
దీనిపై కొందరు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అజాద్‌ను అరెస్టు చేశారు. నిందితుడు వద్ద జరిపిన విచారణలో... తమ మధ్య గతంలో ప్రేమ వ్యవహారం కొనసాగిందనీ, అయితే, పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయగా, ఆమె అంగీకరించలేదని చెప్పారు. ఆ కోపంతోనే హత్య చేసినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments