Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పశ్చిమ బెంగాల్.. కూతురితో తిరుగుతున్నాడని పెట్రోల్ పోసి?

పశ్చిమ బెంగాల్.. కూతురితో తిరుగుతున్నాడని పెట్రోల్ పోసి?
, ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (17:55 IST)
పశ్చిమ బెంగాల్‌లో పరువు హత్య చోటుచేసుకుంది. తమ కుమార్తెను ప్రేమించిన యువకుడిని తల్లిదండ్రులు సజీవదహనం చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంజిత్ మొండల్(21) మిడ్నాపూర్‌లో స్వర్ణకారుడిగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. 
 
ఇది తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు రంజిత్‌కు వార్నింగ్ ఇచ్చారు. కానీ  గత శుక్రవారం యువతిని కలిసేందుకు రంజిత్ వెళ్లగా, అమ్మాయి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. అయినా కసి తీరకపోవడంతో ఊరిబయటకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టారు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రంజిత్ మొబైల్ ఫోన్ ఆధారంగా విచారణ ప్రారంభించిన పోలీసులు అమ్మాయి కుటుంబ సభ్యులే నిందితులని తేల్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ పౌరులంతా అలా వుండటాన్ని చూసి పాక్ కుళ్లుకుంటోంది.. ఓవైసీ