Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో మరణమృదంగం... మెదడు వాపుతో 97 మంది చిన్నారులు మృతి

Webdunia
ఆదివారం, 16 జూన్ 2019 (10:43 IST)
బీహార్‌లో మరణమృదంగం మోగుతోంది. మెదడువాపు వ్యాధికి అనేక మంది చిన్నారులు మృత్యువాతపడతున్నారు. ఇప్పటికే 97 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రంగంలోకి దిగారు. 
 
ఈ ప్రాణాంతకమైన ఈ వ్యాధి బారినపడి చనిపోయిన వారి సంఖ్య 97కు చేరగా, ఒక్క ముజఫర్‌పూర్‌లోనే మృతుల సంఖ్య 84గా ఉంది. వైశాలీ ఆసుపత్రిలో 10 మంది, మోతిహారీ ఆసుపత్రిలో ఒకరు, బెగూసరాయ్ ఆసుపత్రిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారని అధికారులు వెల్లడించారు. కాగా, శుక్రవారం నాడు 57గా ఉన్న మృతుల సంఖ్య 24 గంటల్లోనే పెరిగిపోయింది.
 
ఆసుపత్రుల్లో చికిత్స నిమిత్తం చేరిన చిన్నారులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని, ప్రాణనష్టం పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య మంత్రి హర్ష వర్ధన్ అధికారులను ఆదేశించారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న ముజఫర్‌పూర్‌ను తాను సందర్శిస్తానని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments