Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ పరీక్షలని కుమ్మేశారు, ఎక్కడ?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:49 IST)
నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం పోలీసుల అత్యుత్సాహం చూపించారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఓ యువకుడిని కరోనా పరీక్షల పేరుతో అదుపులోకి తీసుకుని ఆ యువకుడిని చిత్రహింసలు గురిచేశారని ఆ యువకుని తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు దొరవారిసత్రం పోలీస్ స్టేషన్ను ముట్టడించారు.
 
దొరవారిసత్రం మండలం బురద గళ్లు గ్రామానికి చెందిన కండ్రిక వినోద్ అనే యువకుడు బెంగళూరు నుంచి రావడంతో గ్రామ వాలంటీరుకు సమాచారం ఇచ్చి అనంతరం వాళ్ల సలహా మేరకు దొరవారి సత్రం పోలీస్ స్టేషనుకి తీసుకెళ్లగా ఆ యువకునితో పాటు తల్లితండ్రులను సోదరుడిని అదుపులోకి తీసుకుని పరీక్షల నిమిత్తం అక్కడే ఉంచి ఎంతకు వారిని పరీక్షలు చేయకపోవడంతో ఉదయం 10 గంటల నుండి వేచి ఉన్నా సరిగా పట్టించుకోలేదని పోలీసులను అడగడంతో పోలీసులకు చిర్రెత్తింది.
 
పోలీసుల లాఠీకి పని చెప్పారనీ, ఎంత అరిచి మొత్తుకున్నా వాళ్లని చిత్రహింసలకు గురిచేశారనీ, ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు దొరవారి సత్రం పోలీస్ స్టేషన్ ముట్టడించి వారిని విడిచి పెట్టాలని లేకుంటే పురుగు మందులు తాగి అక్కడే చస్తామని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.
 
దొరవారిసత్రం ఎస్సై సుధాకర్రెడ్డి మహిళలను కూడా దుర్భాషలాడారని గతంలో ఇసుక తరలింపు విషయంలో గ్రామస్తులకి ఎస్సైకి మధ్య పాతకక్షలు ఉన్నాయని అదను కోసం ఎస్సై ఎదురుచూసి అవకాశం దొరికిందని యువకుడిని చిత్రహింసలకు చేశాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments