Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గర్భవతి కావడంతో..?

14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గర్భవతి కావడంతో..?
, సోమవారం, 13 ఏప్రియల్ 2020 (20:52 IST)
14ఏళ్ల బాలికపై రెండు నెలల క్రితం సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌లో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులో తొమ్మిదో తరగతి చదువుతున్న 14ఏళ్ల బాలికపై రెండు నెలల క్రితం ఎనిమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ తర్వాత జరిగిన విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారు. దీంతో భయపడ్డ బాధితురాలు విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే గత రెండు రోజులుగా బాలిక కడుపులో నొప్పిగా ఉందని చెబుతుండటంతో తల్లిదండ్రులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గర్భవతి అని చెప్పడంతో బాధితురాలి తల్లిదండ్రులు షాకయ్యారు. 
 
అనంతరం బాలిక ద్వారా జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధ్యులైన 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆధునిక భారత నిర్మాణం కోసం జీవిత కాల పోరాటం చేసిన అంబేద్కర్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్