Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇష్టంలేని విధులు (కరోనా) కేటాయించారనీ తుపాకీతో కాల్చుకున్న ఖాకీ

ఇష్టంలేని విధులు (కరోనా) కేటాయించారనీ తుపాకీతో కాల్చుకున్న ఖాకీ
, మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (20:45 IST)
తనకు ఇష్టంలేని విధులు కేటాయించారన్న మనస్తాపంతో ఒక కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకున్నాడు. ఈ విషాదకర సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో జరిగింది. కరోనా వైరస్ దెబ్బకు దేశం యావత్తూ లాక్‌డౌన్‌లో ఉన్న విషయంతెల్సిందే. ఈ కరోనా విధుల్లో వైద్యులు, పోలీసులు, పారిశ్రామికసిబ్బంది రేయింబవుళ్లు శ్రమిస్తున్నారు. 
 
వేళకు తిండి లేకుండా, ఎక్కడ ఏది దొరికితే అది తింటూ, ఇంటిని వదిలి విధులకే అంకితమయ్యారు. ఈ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్‌లోని ఓ పోలీస్ కానిస్టేబుల్ ఒత్తిడి భరించలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. భోపాల్‌లో విధులు నిర్వర్తిస్తున్న చేతన్ సింగ్ అనే 36 ఏళ్ల కానిస్టేబుల్ తన సర్వీసు తుపాకీతో కాల్చుకున్నాడు. దాంతో సహచరులు వెంటనే అతడ్ని భోపాల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా, ప్రమాదమేమీ లేదని వైద్యులు వెల్లడించారు. 
 
ఇకపోతే, చేతన్ సింగ్ తనకు కరోనా విధులు కేటాయించడంతో పైఅధికారుల పట్ల అసంతృప్తితో ఉన్నట్టు అతని అనుచరులు చెబుతున్నారు. విధి నిర్వహణలో తనకు కూడా కరోనా సోకుతుందేమోనని భయంతో విధులు నిర్వహిస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు కూడా పెద్దగా పట్టించుకోలేదు. 
 
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ కానిస్టేబుల్ తొలుత గాల్లోకి కాల్పులు జరిపి ఆ తర్వాత తన ఎడమ చేతిని గురిపెట్టుకుని కాల్చుకున్నాడు. అయితే, అదృష్టవశాత్తు ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కాగా, భోపాల్‌లో ఇప్పటికే పది మంది కానిస్టేబుల్స్ కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్‌డౌన్ '1.0'లో సాధించిన ఫలితాల రక్షణ కోసమే '2.0' : వెంకయ్య నాయుడు