టిటిడి ఉద్యోగులు గ్రేట్.. కరోనా వైరస్ నిరోధించేందుకు భారీ విరాళం

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:36 IST)
ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్. అయితే వైరస్ నియంత్రణకు ప్రభుత్వాలకు అవసరమైన డబ్బులు లేవు. అందులోను ఎపిలో ఆర్థిక సమస్య ఎక్కువగా ఉంది. దీంతో పలువురు ప్రముఖులు తమ వంతు సాయంగా విరాళాలను అందిస్తున్నారు. అయితే మొట్టమొదటిసారి తిరుమల శ్రీవారి చెంత పనిచేసే ఉద్యోగులు సిఎం సహాయనిధికి విరాళం ఇచ్చారు.
 
అది కూడా అక్షరాలా 83 లక్షల 86 వేల 747 రూపాయలు. టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డితో కలిసి వెళ్ళిన టిటిడి ఉద్యోగ సంఘాల నాయకులు నేరుగా తాడేపల్లి గూడెంలోని ముఖ్యమంత్రికి చెక్కు రూపంలో నగదును అందజేశారు. టిటిడిలో శాశ్వత ఉద్యోగులు 7 వేల మంది, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 14 వేల మంది ఉన్నారు. మొత్తం 21 వేల మంది ఉద్యోగులు తమ మార్చి నెల జీతం మొత్తాన్ని సిఎంకు విరాళంగా అందజేశారు.
 
టిటిడి ఉద్యోగులు, సిబ్బంది తీసుకున్న నిర్ణయంపై ఉన్నతాధికారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విపత్కరమైన పరిస్థితుల్లో అందరు కలిసికట్టుగా ఈ నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి కూడా ఆనందం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Isha Rebba: AI-ఆధారిత చికిత్సా శరీర ఆకృతి కోసం భవిష్యత్ : ఈషా రెబ్బా

Meghana Rajput: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మిస్టీరియస్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments