Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం చెప్తిరి.. ఏం చెప్తిరి... సెల్ఫీ ఇవ్వలేదని కోడిగుడ్లతో దాడిచేశారట...

Webdunia
గురువారం, 8 జూన్ 2023 (08:52 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గత కొన్ని రోజులుగా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఇటీవల ఆయన కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆయనపై కొందరు దుండగులు కోడిగుడ్లతో దాడి చేశారు. లోకేశ్ పాదయాత్రలో నడిచి వెళుతుండగా, ఆయన్ను లక్ష్యంగా చేసుకుని ఈ కోడిగుడ్ల దాడి జరిగింది. అయితే, ఆ గుడ్లు లోకేశ్ భద్రతా సిబ్బందికి తగిలి పగిలిపోయాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... తాజాగా ఇద్దర్ని అరెస్టు చేశారు. వారిని పెన్నా నగర్‌కు చెందిన బాలు, శ్రీకాంత్ అనే వారిగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ దాడి ఘటనపై కడప జిల్లా ఏఎస్పీ ప్రేరణ కుమార్ తాజాగా వివరణ ఇచ్చారు. ఈ నెల ఒకటో తేదీన ప్రొద్దుటూరులో పాదయాత్ర నిర్వహించిన సమయంలో నిందితులు బాలు, శ్రీకాంత్‌ కోడిగుడ్లు విసిరానని చెప్పారు. నిందితులిద్దరూ మంచి స్నేహితులని చెప్పారు. నారా లోకేశ్ తమకు సెల్ఫీ ఇవ్వలేదన్న అక్కసుతోనే కోడిగుడ్లతో దాడిచేశారని, వీరిద్దరూ మాట్లాడుకునే ఈ దాడికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments