Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏకి ప్రధాని మోడీ సర్కారు షాక్.. పోలవరం నిధుల్లో కోత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు మరో వాతపెట్టింది. పోలవరం నిధుల్లో కోత విధించింది. ఈ మేరకు ఓ జీవోను జారీ చేసింది. పోలవరం నిర్మాణానికి నాబార్డు ద్వారా రూ.1400 కోట్లు తీసుకునే

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (15:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు మరో వాతపెట్టింది. పోలవరం నిధుల్లో కోత విధించింది. ఈ మేరకు ఓ జీవోను జారీ చేసింది. పోలవరం నిర్మాణానికి నాబార్డు ద్వారా రూ.1400 కోట్లు తీసుకునేందుకు తొలుత అనుమతించింది. ఆ తర్వాత రెండ్రోజుల్లోనే కేంద్రం మాట మార్చింది. 
 
పోలవరానికి రూ.311 కోట్లు కోత పెట్టి కేవలం రూ.1,089 కోట్లు మాత్రమే ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని కేంద్ర జలవనరులశాఖ ఆదేశించింది. ఇప్పటికే విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలవరానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల్లో కోత విధించడంపై ప్రజలు మండిపడుతున్నారు. 
 
ప్రస్తుతం విభజన చట్టంలో ఏపీకి తీవ్రమైన అన్యాయం జరిగిందని టీడీపీ, వైసీపీ, వామపక్షాలు  ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలు కలిసి ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై వేర్వేరుగా అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చాయి. ఇలాంటి సందర్భంలో కేంద్రం పోలవరానికి ఇవ్వాల్సిన నిధులపై కోత పెట్టడంతో పుండుమీద కారం చల్లినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments