ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

ఠాగూర్
గురువారం, 16 అక్టోబరు 2025 (16:31 IST)
ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అలాగే, ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా ఏపీ ఉందన్నారు. ఒక రోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా, గురువారం కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్‌ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌’ పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధాని మోడీతో పాటు సీఎం చంద్రబాబు, గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, నారా లోకేశ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 
 
ఇందులో ప్రధాని మోడీ మాట్లాడుతూ, 'సైన్స్‌, ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఉంది. ఏపీలో అనంత అవకాశాలతో పాటు యువతకు అపార శక్తి ఉంది. అహోబిలం నర్సింహస్వామి, మహానంది ఈశ్వరుడికి నమస్కరిస్తున్నా. మంత్రాలయం రాఘవేంద్రస్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నా. జ్యోతిర్లింగం సోమనాథుడి నేల అయిన గుజరాత్‌లో నేను జన్మించాను. విశ్వనాథుడి భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం లభించింది. ఇవాళ శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆశీస్సులు పొందాను.
 
చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ రూపంలో ఏపీకి శక్తిమంతమైన నాయకత్వం ఉంది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంది. 16 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఆధ్వర్యంలో రాష్ట్రం అపూర్వ ప్రగతి సాధిస్తోంది. ఢిల్లీ, అమరావతి వేగంగా అభివృద్ధి పథంలో సాగుతున్నాయి. 2047 నాటికి మన దేశం.. వికసిత్‌ భారత్‌గా మారుతుంది. 21వ శతాబ్దం.. 140 కోట్ల భారతీయుల శతాబ్దం' అని ప్రధాని మోడీ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RC 17: పుష్ప 3 కు బ్రేక్ - రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో ఆర్.సి. 17 రెడీ

Aadi Sai Kumar: ఆది సాయి కుమార్ మిస్టికల్ థ్రిల్లర్ శంబాల రిలీజ్ అనౌన్స్‌మెంట్

Dude: ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ సినిమాకి రిపీట్ ఆడియన్స్ వస్తున్నారా !

K. Ramp Review: కిరణ్ అబ్బవరం.. కె. ర్యాంప్ తో సక్సెస్ సాధించాడా... కె. ర్యాంప్ రివ్యూ

Harish Shankar: ప‌వ‌న్ క‌ల్యాణ్... ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ గురించి నిర్మాత తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments