Webdunia - Bharat's app for daily news and videos

Install App

అట్టహాసంగా ప్రధాని మోడీ నామినేషన్ ఘట్టం - చంద్రబాబు - పవన్ హాజరు

ఠాగూర్
మంగళవారం, 14 మే 2024 (17:31 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ ఘట్టం అట్టహాసంగా జరిగింది. ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి మరోమారు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ షిండే, టీఎంసీ అధినేత జీకే వాసన్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో సోమవారం జరిగిన పోలింగ్ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో ఎంతో ఆప్యాయంగా ఉత్సాహంగా మాట్లాడుతూ వారిద్దిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి చంద్రబాబు కూడా బెస్ట్ విషెస్ తెలిపారు. 
 
పవన్ కళ్యాణ్ మెజార్టీ అంశంపై అంచనాలు తప్పేలా ఉన్నాయ్ గురూ : రఘురామకృష్ణంరాజు 
 
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు పిఠాపురంలో వచ్చే మెజార్టీ విషయంలో తాను వేసిన అంచనా తప్పేలా ఉందని ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణ రాజు వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, ఏపీలో పోలింగ్ సరళి చూశాక తన అంచనాలు తారుమారయ్యేలా కనిపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా, కూటమికి మరిన్ని స్థానాలు వస్తాయని తెలిపారు. 150కి పైగా ఎమ్మెల్యే స్థానాలతో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
 
మెజార్టీల విషయంలోనూ తన అంచనాలు సవరిస్తున్నట్టు చెప్పారు. నెలకిందట పవన్ కళ్యాణ్‌ వద్దకు వెళ్ళానని, అపుడు ఆయనకు 50 వేల నుంచి 55 వేల మెజార్టీ రావొచ్చని భావించానని చెప్పారు. కానీ ఇపుడు తన అంచనా తప్పేలా ఉందన్నారు. పవన్ కళ్యాణ్‌కు పిఠాపురం నియోజకవర్గంలో 65 వేలకు పైగా మెజార్టీ రావొచ్చన్నారు. కొన్ని బూత్‍‌లలో పవన్‌‍కు అనుకూలంగా 80 శాతం మేరకు పోలింగ్ జరిగినట్టు తెలుస్తుందన్నారు. 
 
అలాగే, కుప్పంలో కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 60 వేల మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పారు. చంద్రబాబును ఓడించడానికి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు డబ్బులు ఇచ్చారని, అయినప్పటికీ గెలుపు మాత్రం చంద్రబాబుదేనని జోస్యం చెప్పారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబుపై కన్నా లక్ష్మీనారాయణ భారీ మెజార్టీతో గెలుస్తారన్నారు. 
 
ఇకపోతే, పశ్చిమ గోదావరి జిల్లాలో వార్ వన్‌సైడ్ అని, కూటమి క్లీన్ స్వీప్ చేయడం తథ్యమని రఘురామ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరిలో అందరూ నెగ్గుతారని వెల్లడించారు. అయితే ఇవన్నీ కరెక్టా, కాదా అనేది జూన్ 4న తెలుస్తుందని పేర్కొన్నారు. తన అంచనాలు ఖచ్చితంగా నిజమవుతాయని నమ్ముతున్నట్టు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments