Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ 2024 : యుజువేంద్ర చావల్ అరుదైన ఘనత

yuzvendrachahal

ఠాగూర్

, బుధవారం, 8 మే 2024 (09:29 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్‌లో భారతీయ క్రికెటర్ యజువేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 350 వికెట్లు తీసిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రిషభ్ పంత్ వికెట్ తీయడం ద్వారా చాహల్ ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఓవరాల్‌గా చాహల్ 11వ ఆటగాడిగా నిలిచాడు. 
 
ఇక ఈ జాబితాలో టాప్-10 స్థానాల్లో బ్రావో 625 వికెట్లు, రషీద్ ఖాన్ 572, సునీల్ నరైన్ 549, ఇమ్రాన్ తాహీర్ 502, షకీబల్ హాసన్ 482, ఆండ్రీ రస్సెల్ 443, అబ్దుల్ రియాజ్ 413, లసిత్ మలింగా 390, తన్వీర్ 389, క్రిస్ జోర్డాన్ 368 వికెట్లు చొప్పున తీశారు. 
 
ఇక పొట్టి ఫార్మెట్‌లో ఎపుడు స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకోవడం యజువేంద్ర చాహల్ ప్రత్యేకత. ఇటీవలే ఐపీఎల్ 200 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కూడా చరిత్రకెక్కాడు. అలాగే, వచ్చే నెలలో జరుగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ పోటీల కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ : భారత్ - పాకిస్థాన్ జట్లకు కొత్త జెర్సీలు..