కుక్కకాటుతో ఐదు నెలల బాలుడు మృతి.. ఇంట్లో వదిలి కూలీకి వెళ్తే...

సెల్వి
మంగళవారం, 14 మే 2024 (17:21 IST)
వికారాబాద్ జిల్లా తాండూరులో మంగళవారం కుక్కకాటుతో ఐదు నెలల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌కు చెందిన దత్తు, లావణ్య దంపతులు ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ తమ బిడ్డ సాయితో కలిసి నివసిస్తున్నారు. 
 
రోజూలాగే మంగళవారం కూడా దంపతులు తమ ఐదు నెలల కుమారుడిని ఇంట్లో వదిలి కూలి పనులకు వెళ్లారు. పనిలో మధ్య లావణ్య నీళ్లు తాగేందుకు ఇంటికి తిరిగి రాగా ఇంటి దగ్గర ఓ కుక్క సంచరించడం గమనించింది. ఆమె ఇంటి లోపలికి వెళ్లి చూడగా కుమారుడిపై కుక్క దాడి చేసి కనిపించింది. వెంటనే కుటుంబీకులు చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
 
కుక్క ఫ్యాక్టరీ యజమానులదని, వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. అయితే, ఫ్యాక్టరీ యజమానులు తమ వద్ద పెంపుడు కుక్క లేదని, వీధి కుక్క పిల్లవాడిపై దాడి చేసి వుండవచ్చునని చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments